తమిళ్ లో స్టార్ హీరోగా గుర్తింపు ఉన్న యాక్షన్ హీరో విశాల్ కు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. అయితే ప్రస్తుతం విశాల్ హీరోగా ఎంఎస్ ఆనందన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం `విశాల్ చక్ర`. శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఒక కీలకపాత్రలో రెజీనా కసాండ్ర నటిస్తోంది. అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్ నిర్మిస్తున్నారు. ఇదిలాఉంటే, ‘చక్ర’ సినిమా కథపై హక్కులు తమవే అంటూ.. నిర్మాత రవి మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. దాంతో హైకోర్టు విశాల్ కు షాక్ ఇచ్చింది. పిటీషన్ ను విచారించిన కోర్టు సినిమా విడుదలపై స్టే విధించింది. తదుపరి విచారణ ఈరోజు కి వాయిదా వేసింది. అయితే తాజాగా దీని పై విచారణ జరిపిన కోర్టు చక్ర పై విధించిన స్టే ను ఎత్తివేసింది. అయితే ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. చూడాలి మరి ఈ సినిమా ఎంత మేరకు అభిమానులను ఆకట్టుకుంటుంది అనేది.
previous post