telugu navyamedia
సినిమా వార్తలు

మహా సముద్రం నుండి “హే రంభ’ సాంగ్‌

టాలీవుడ్‌లో ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అజయ్‌ భూపతి తెరకెక్కిస్తున్న రెండో చిత్రం ‘మహా సముద్రం’. ఈ సినిమాలో శర్వానంద్‌, సిద్ధార్థ్‌ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్‌, ఆదితి రావు హైదరీ హీరోయిన్‌గా నటిస్తుండగా… జగపతిబాబు, రావు రమేశ్‌ ఇతర ఈ సినిమాలో కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది.

తాజాగా ఈ సినిమా నుండి ‘హే రంభ’ సాంగ్‌ విడుదలైంది. ఒకప్పుడు తన కొంటె చూపులతో, ఆకర్షించే అందచందాలతో గతంలో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన నటి రంభ పై ఈ పాట రాశారు. ఈ పాట మాస్‌ ఆడియాన్స్‌ని, రంభ ఫ్యాన్స్‌ని బాగా ఆకట్టకుంటుంది. చైతన్‌ భరద్వాజ్‌ ఆలపించిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించారు. శర్వానంద్ తో పాటు నటుడు జగపతిబాబు కూడా ఈ పాటకు స్టెప్పులేశారు. సెకండ్‌ ఇన్నింగ్స్‌ తరువాత విలన్‌ పాత్రలు చేస్తున్న జగపతి ఈ పాటలో చిందులేయడం నెటిజన్లను ఆకర్షిస్తుంది. ప్రస్తుతం ఈ సాంగ్‌ వైరల్‌ అవుతుంది.

Related posts