సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ దంపతులు కాసేపటి క్రితమే యాదాద్రి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ఇవాళ ఉదయం యాదాద్రికి వెళ్ళిన ఎన్వి రమణ దంపతులకు తెలంగాణ మంత్రులు జగదీశ్ రెడ్డి మరియు ఇంద్రకరన్ రెడ్డి స్వాగతం పలికారు. అలాగే ఆలయ అర్చకులు సీజేఐ దంపతులకు పూర్ణకుంభంతో ఆలయంలోకి స్వాగతించారు. యాదాద్రి కి చేరుకున్న ఎన్వి రమణ దంపతులు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు.
దర్శనం అనంతరం ఆలయంలో జస్టిస్ ఎన్వి రమణ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్మాణాలను అక్కడి పరిస్థితులను ఎన్వి రమణ పరిశీలించారు. ఆలయ విశిష్టత గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాగా ఎన్వి రమణతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళసై పాల్గొనాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల వారిద్దరి పర్యటన రద్దు అయింది.