తెరాస పార్టీకి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ నిన్న బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈటల రాజేందర్ తో పాటుగా ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ, రమేష్ రాథోడ్, అశ్వద్ధామ రెడ్డి, ఓయు జేఏసీ నేతలు బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. అయితే ఢిల్లీ పర్యటనను ముగించకొని వస్తున్న ఈటల బృందానికి ప్రమాదం తప్పింది. ఈటల రాజేందర్ ఢిల్లీ నుండి వస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అయితే ఫైలెట్ అలెర్ట్ అవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. సమస్యను గుర్తించిన ఫైలెట్ చాకచక్యంగా వ్యవహరించడంతో అందరు సేఫ్ అయ్యారు. ఈ విమానంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రఘనందన్, వివేక్, ఏనుగు రవీందర్ రెడ్డి,తుల ఉమాతో పాటు మొత్తం 184 మంది ఉన్నట్లు సమాచారం. ఇక ఈ ఘటన అనంతరం ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో కాసేపటి క్రితమే ఈటల రాజేందర్ బృందం హైదరాబాద్ కు బయలు దేరింది. మరి కొద్ది నిమిసాల్లో ఈటల ప్రయాణించే విమానం హైదరాబాద్కు చేరుకోనుంది.
పూజా హెగ్డే నడుముపై దర్శకేంద్రుడి చమత్కారం… సంచలనంగా మారిన వ్యాఖ్యలు