telugu navyamedia
సినిమా వార్తలు

బిగ్‌బాస్ కంటెస్టెంట్లపై నాగార్జున ఆగ్ర‌హం..

‘బిగ్‌బాస్‌ సీజన్‌-5’లో కంటెస్టెంట్లపై నాగార్జున ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ వారం జరిగిన ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ’ టాస్క్‌పై వ్యాఖ్యాతగా అంద‌రికి క్లాస్ తీసుకున్నారు.

తాజాగా విడుదలైన ప్రోమోలో .. సంచాల‌కులు త‌ప్పు చేస్తే బిగ్‌బాస్ అన‌ర్హ‌త వేటు వేస్తాడ‌ని ఇంటి స‌భ్యుల‌కు క్లారిటీ ఇస్తూనే అందరిపై ఒట్టు వేయటం ఏంటని యాని మాస్టర్ పై ఫైర్ అయ్యాడు నాగ్. నామినేషన్స్‌ సందర్భంగా ‘మీరంతా నటులు’ అంటూ శ్రీరామ్‌ చేసిన వ్యాఖ్యలపైనా నాగార్జున అసహనం వ్యక్తం చేశారు. ‘యాక్టర్‌ అంటే చిన్న చూపా’ అంటూ శ్రీరామ్‌ను ప్రశ్నించారు.

మరోవైపు హౌస్ ప్రాపర్టీస్ ని ధ్వసం చేయటం తప్పని తెలియదా అంటూ లోబోకి క్లాస్ పీకాడు నాగార్జున. దీంతో యాంకర్ రవి చెప్తేనే అలా చేశానంటూ కౌంటర్ ఇస్తున్న లోబోపై మరింత చిందులు తొక్కాడు. రవి గడ్డి తినమంటే తింటావా అంటూ లోబోపై సీరియస్ అయ్యాడు నాగార్జున. ఇక లోబోకి ఈ ఐడియా ఇచ్చిన యాంకర్ రవిపై విరుచుకుపడ్డాడు నాగార్జున. ఎందుకలా సలహా ఇచ్చావ్ అంటూ రవిని అడుగుతుంటే.. మధ్యలోనే రవి కలుగచేసుకుని శ్వేత కూడా కుష‌న్స్ క‌ట్ చేస్తుంద‌న్న విష‌యం త‌న‌కు తెలియ‌ద‌ని ఎదో చెప్తుండగా.. నేను కూడా త‌న ఐడియానే ఫాలో అవుతున్నా అంటూ రవిని ఇరికించేసింది శ్వేత.

దీంతో నాగార్జున రవి గాలి తీసేశాడు. హౌస్ మేట్స్ మాటలు వింటుంటే..అప్పట్లో న‌ట‌రాజ్ మాస్ట‌ర్ రవిని గుంటనక్క అని చేసిన కామెంట్స్ కరెక్ట్ ఏమో అనిపిస్తుంది అన్నట్టు వ్యాఖ్యానించాడు. దీంతో సిగ్గుతో తలదించుకున్నాడు యాంకర్ రవి. ప్రోమోతోనే మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ ఎపిసోడ్ ఈ రోజు రాత్రికి టెలికాస్ట్ అవ్వనుంది.

Related posts