ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు విష ఆహారం తినిపించింది. పిల్లలు చనిపోయారని తెలుసుకున్న తరువాత, ఆ తల్లి సైతం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరంలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే భర్త అత్తమామల వేధింపులే తమ కూతురు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.