telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఓటర్ల జాబితా విడుదల చేసిన జీహెచ్ఎంసీ కమిషనర్…

హైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేసారు జీహెచ్ఎంసీ కమిషనర్. మొత్తం 150 సర్కిల్లో 74 లక్షల 4 వేల 17 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు సంఖ్య 38 లక్షల 56 వేల 617.  మహిళల ఓటర్లు సంఖ్య 35 లక్షల 46 వేల 731 . అలాగే ఇతర ఓటర్లు 669 మంది. ఇక రేపటి నుంచి ఈనెల 11 వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది అని కమిషనర్ తెలిపారు. అలాగే వార్డుల వారీగా తుది ఫోటో ఓటర్ల జాబితా ఈనెల 13 న ప్రకటించనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ స్పష్టం చేసారు. అయితే జీహెచ్ఎంసీ పరిధిలో ఓటు నమోదై ఉండి ఎన్నికల విధులకు హాజరయ్యే ప్రభుత్వ సిబ్బందికి, కోవిడ్ 19 వలన క్వారంటైన్ లో ఓటర్లు, వయో వృద్ధులకు ప్రయోగాత్మకంగా ఈ-వోటింగ్ ద్వారా ఓటు హక్కు కల్పించడానికి నిర్ణయించిందని రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మధ్యే ఓ ప్రకటన చేసింది. ఎన్నికల సమయంలో…వృద్ధులు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు వేయడం ఇబ్బందిగా మారుతున్న సంగతి తెలిసిందే. కొంతమంది నడవలేని పరిస్థితుల్లో ఉన్నవారు ఓటు వేయడానికి ఆసక్తి చూపడం లేదు. కొంతమంది కుటుంబసభ్యులు వాహనాల్లో తీసుకరావడం, ఓటు వేయించడం కష్టంగా ఉంటోంది. ఈ క్రమంలో ఈ-ఓటింగ్ విధానం అమల్లోకి వస్తే.. చాలా మేలు జరుగుతుందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related posts