telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

క్యూనెట్ స్కామ్ లో 38 కేసులు నమోదు: పోలీస్ కమిషనర్ సజ్జనార్

police sajjanar

క్యూనెట్ స్కామ్ కు సంబంధించి మొత్తం 38 కేసులు నమోదయ్యాయని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 70 మందిని అరెస్ట్ చేశామని ఈ 12 మందిపై లుకౌట్ నోటీసులు జారీ చేశామని తెలిపారు. క్యూనెట్ ను ప్రమోట్ చేసిన సినీ ప్రముఖులందరికీ నోటీసులు పంపామని చెప్పారు.

సాఫ్ట్ వేర్ ఉద్యోగులే లక్ష్యంగా క్యూనెట్ కుంభకోణం జరిగిందని తెలిపారు. సంస్థలో పని చేస్తున్న సొంత ఉద్యోగులను కూడా మోసం చేసిందని చెప్పారు. క్యూనెట్ బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఎవరూ అందులో పెట్టుబడులు పెట్టవద్దని సూచించారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో ఆ సంస్థ మోసాలకు పాల్పడుతోందని తెలిపారు.

Related posts