telugu navyamedia
క్రీడలు వార్తలు

కలకలం రేపుతున్న వ్యాక్సిన్ దొంగతనం…

covishield vaccine

కరోనాను అదుపు చేయడానికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అని అంటున్న సమయంలో తెలంగాణలో వ్యాక్సిన్ ల చోరీ కలకలం రేపుతోంది. కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో 500 కోవిషిల్డ్ డోసులు మాయం అయ్యాయి. ఈ ఘటనలో ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు ఆసుపత్రి సిబ్బంది, అధికారులు. అయితే ఈ కోవిషిల్డ్ డోసులు మాయమైన రోజు నుంచి ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి కూడా కనిపించడం లేదు. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు ఆసుపత్రి సూపరిండెంట్. అనంతరం ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే తెలంగాణలో రోజుకు 4 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నా విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఈ వార్త వైరల్ గా మారింది.

Related posts