telugu navyamedia
రాజకీయ వార్తలు

ఏపీలో మతమార్పిళ్లు తప్ప మరేం జరగడం లేదు: కన్నా

Kanna laxminarayana

ఏపీలో మతమార్పిళ్లు తప్ప మరేమీ జరగడం లేదని బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఏమాత్రం అనుభవంలేని వ్యక్తి సీఎంగా రావడం ఏపీ ప్రజల దౌర్భాగ్యం అని అభివర్ణించారు. తిరుపతి సహా అనేక హిందూ దేవాలయాల్లో క్రైస్తవులు తిష్టవేశారని ఆరోపించారు. గతంలో గుట్టుగా సాగిన మతమార్పిళ్లు నేడు జగన్ మద్దతు కారణంగా బహిరంగంగా సాగుతున్నాయని విమర్శించారు. జగన్ ప్రభుత్వం హిందువులకు పూర్తి వ్యతిరేకమని ఆరోపించారు.

 భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడ్ని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పరిస్థితికి వచ్చారని కన్నా వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుండడం పట్ల కూడా ఆయన స్పందించారు. తెలుగు భాషకు ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉందని అన్నారు. ఎంతోమంది పోరాటాల ఫలితంగా ఈ స్థితికి చేరుకున్న తెలుగును చంపాలని చూస్తున్న జగన్ కు కూడా చంద్రబాబుకు పట్టిన గతే పడుతుందని అన్నారు.

Related posts