రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని టార్గెట్ చేస్తూ, మోదీ వ్యతిరేక ఓట్లను పొందాలనేది టీఆర్ఎస్ వ్యూహమని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక పార్టీని తిడుతూ పబ్బం గడుపుకోవడం టీఆర్ఎస్ నైజమని ఆమె మండిపడ్డారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని తిడుతూ ప్రచారం నిర్వహించారని అన్నారు.
పార్లమెంటు ఎన్నికల్లో అదే వ్యాహాన్ని అమలు చేస్తారని పేర్కొన్నారు. బీజేపీని కాంగ్రెస్ పార్టీకంటే తామే ఎక్కువగా వ్యతిరేకిస్తున్నామనే భ్రమలను ప్రజల్లోకి పంపిస్తారని తెలిపారు. టీఆర్ఎస్ కు పడే ప్రతి ఓటు తమకు వేసినట్టే అనే ధీమాతో బీజేపీ నేతలుఉన్నారని చెప్పారు. బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని టీఆర్ఎస్ నేతలు అంటున్నప్పటికీ కమలం పార్టీ పెద్దలు ఆవిషయాన్ని పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.