telugu navyamedia
రాజకీయ వార్తలు

రాహుల్ ఊహాజనిత రాజకీయాలు మానుకోవాలి: అమిత్ షా

amith shah bjp

చైనా వ్యవహారంపై పార్లమెంటులో ఎలాంటి చర్చకైనా తాము సిద్ధమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఇప్పుడు తమ ప్రభుత్వం దేనికైనా జవాబిస్తుందని, 1962 నుంచి ఇప్పటివరకు ఏం జరిగిందో పార్లమెంటులో సిసలైన చర్చకు సిద్ధంగా ఉందని అమిత్ షా పేర్కొన్నారు . సరెండర్ మోదీ అనే హ్యాష్ ట్యాగ్ పై రాహుల్ గాంధీ ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు.

పాకిస్థాన్, చైనా ఇలాంటి దుష్ప్రచారాలను ప్రోత్సహిస్తున్నాయని అన్నారు. భారత వ్యతిరేక ప్రచారాలను ఎదుర్కొనే సత్తా తమ ప్రభుత్వానికి ఉందన్నారు. అతిపెద్ద రాజకీయ పక్షానికి అధ్యక్షుడిగా వ్యవహరించిన వ్యక్తి ఊహాజనిత రాజకీయాలు చేయడం బాధాకరమని అన్నారు.

Related posts