telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మిగతా విషయాలపై మాట్లాడే దమ్మే లేదు: విజయసాయి రెడ్డి

Vijayasai reddy ycp

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఎవరి పేరును ప్రస్తావించకుండా ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు. తన అవినీతి ఎలా బయటపడుతుందోనన్న టెన్షన్ తప్ప మిగతా విషయాల గురించి పట్టించుకోవడం లేదని, ఎవరి పేరునూ వెల్లడించకుండా తన ట్విట్టర్ ఖాతాలోఆయన ఓ ట్వీట్ పెట్టారు.

“మళ్లీ అవే ఏడుపులు. అమరావతి, పోలవరం, మచిలీపట్నం పోర్టు, నవయుగకు అన్యాయం, పిపిఏల సమీక్ష, కాంట్రాక్టర్ల బిల్లులు. ఎంత సేపు తన అవినీతి ఎక్కడ బయట పడుతుందోనన్న టెన్షనే తప్ప 4 లక్షల ఉద్యోగాల గురించి, ఆర్టీసి ప్రభుత్వంలో విలీనం గురించి ఒక్క మాట మాట్లాడే దమ్ములేదు” అని పేర్కొన్నారు.

Related posts