telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఏపీసీఎం తో.. కేసీఆర్ భేటీ…

apcm and kcr meeting

ఏపీసీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డితో తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. ఈ రోజు విజయవాడ చేరుకున్న కేసీఆర్‌ తొలుత దుర్గమ్మను దర్శించుకున్న అనంతరం నేరుగా తాడేపల్లిలోని జగన్‌ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌, కేటీఆర్‌, ఇతర నేతలకు జగన్‌ సాదర స్వాగతం పలికారు. మధ్యాహ్న భోజనం అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులూ పలు సమస్యలపై చర్చించనున్నారు. విభజన చట్టంలో పరిష్కారానికి నోచుకోని అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలోని ప్రభుత్వ రంగ సంస్థల విభజన, విద్యుత్‌ ఉద్యోగులు పంపకాలు, విద్యుత్‌ బిల్లుల బకాయిలు తదితర అంశాలపై ఇరువురు సీఎంలు చర్చించే అవకాశం ఉంది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి వివాదాల పరిష్కారంపైనా ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని ఈ సందర్భంగా కేసీఆర్‌ జగన్‌ను ఆహ్వానించనున్నారు.

Related posts