telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

కొండ చరియలు విరిగి పడి ఒక వ్యక్తి మృతి…

విజయవాడ లో నాలుగు స్తంభాల సెంటర్ లో కొండచరియలు విరిగి నివాసాల మీద పడటంతో మట్టిలో కూరుకుపోయి వ్యక్తి ఓ వ్యక్తి మరణించాడు. దాంతో విజయవాడ కొండ ప్రాంత వాసుల్లో భయం నెలకొంది. రాత్రి కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలో పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డయి. కుమ్మరిపాలెం ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు, ఒకరికి పరిస్థితి విషమం. కొండ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, కార్పొరేషన్ అధికారులు సూచించారు. అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు విద్యాధరపురం నాలుగు స్తంభాల సెంటర్ కొండ ప్రాంతంలో ఉంటున్న ఓ నివాసం పై కొండచరియలు విరిగిపడి ఇల్లంతా ధ్వంసం అయ్యింది. అయితే ఆ ఇంట్లో ఉన్న ఓ వ్యక్తి మట్టిలో కూరుకుపోయాడు. అయితే భవానిపురం పోలీసులు తక్షణమే స్పందించి మట్టిని తొలగించి ఆ వ్యక్తిని అంబులెన్స్ ద్వారా హాస్పిటల్ కి తరలించా నా ఫలితం దక్కలేదు. దారిలోనే అతను మరణించాడు.

Related posts