మహేశ్కి డైరెక్టర్ అనిల్ రావిపూడి కుటుంబం ధన్యవాదాలు తెలిపింది. ఓ వీడియో ద్వారా అనిల్ కుటుంబ సభ్యులు మహేశ్కు థ్యాంక్స్ చెప్పారు. సంక్రాంతి పండగకి ముందే బ్లాక్బస్టర్ కా బాప్ ఇచ్చారని, అనిల్కు అవకాశం ఇచ్చినందుకు అనిల్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలంటూ ఈ వీడియో అనిల్ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ వీడియోను మహేశ్ సతీమణి నమ్రత శిరోద్కర్ తన ఇన్స్టా అకౌంట్లో పోస్ట్ చేసి అనిల్ కుటుంబానికి థ్యాంక్స్ చెప్పారు. బ్లాక్బస్టర్ ఇచ్చినందుకు అనిల్కు థ్యాంక్స్ చెప్పారు.
సంక్రాంతి సందర్భంగా విడుదలైన `సరిలేరు నీకెవ్వరు` జనవరి 11న విడుదలై హిట్ టాక్తో మంచి వసూళ్లను సాధిస్తుంది. మహేశ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ చిత్రం విజయశాంతి కీలక పాత్రలో నటించారు. దిల్రాజు సమర్పణలో జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఎ.కె.ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.