telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

షూటింగ్‌ మధ్యలోనే పేకప్ చెప్పేసిన శృతి హాసన్…

Shruti-Haasan

కమలహాసన్ కూతురిగా ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరోయిన్ శృతి హాసన్ దక్షిణ అన్ని భాషల్లో అవకాశాలు అందుకుని బిజీ బిజీగా గడుపుతుంది. తెలుగులో శృతి హాసన్ ఎన్నో సినిమాల్లో నటించింది. పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ సహా ఎందరో హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. వీటిలో చాలా వరకు హిట్లే ఉన్నాయి. ప్రస్తుతం తెలుగులో రవితేజ, పవన్ కళ్యాణ్ సినిమాలను చేస్తోంది శ్రుతి హసన్. ఇక తమిళ్ లో విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘లాభం’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. కరోనా ప్రభావం తగ్గుతోన్న నేపథ్యంలో ఎస్పీ జగన్నాథన్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ధర్మగిరి, కృష్ణగిరి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ప్రస్తుతం అక్కడ హీరో, హీరోయిన్లతో పాటు కొందరు ముఖ్య నటీనటులతో క్లైమాక్స్ పార్ట్ చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు విజయ్‌-శ్రుతిహాసన్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో వచ్చారు. దీంతో హీరోయిన్ శ్రుతిహాసన్‌ షూటింగ్‌ మధ్యలోనే పేకప్ చెప్పేసి సెట్‌ నుంచి వెళ్లిపోయారు. కరోనా వైరస్ ప్రభావం ఉన్న కారణంగానే శృతి హాసన్ అక్కడి నుంచి వెళ్లినట్లు తెలుస్తుంది.

Related posts