అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భార్య మెలానియా విగ్రహానికి కొందరు దుండగులు నిప్పు పెట్టారు. మెలానియా స్వస్థలమైన స్లోవేనియాలో ఏర్పాటు చేసిన ఆమె కర్ర విగ్రహానికి ఈ నెల 4న నిప్పు పెట్టినట్టు విగ్రహాన్ని తయారు చేసిన కళాకారుడు బ్రాడ్ డౌనీ తెలిపారు. విగ్రహం దెబ్బతిన్న విషయాన్ని పోలీసులు తనకు సమాచారం ఇవ్వడంతో దానిని తొలగించినట్టు ఆయన వివరించారు.
మెలానియా ట్రంప్ విగ్రహానికి నిప్పు ఘటన అమెరికాలో రాజకీయ చర్చకు కారణమవుతుందని భావిస్తున్నట్టు డౌనీ పేర్కొన్నారు. అయితే, ఈ ఘటనపై అమెరికా ఇప్పటి వరకు స్పందించలేదు. విగ్రహానికి నిప్పు ఘటనపై దర్యాప్తు పూర్తి కాకపోవడంతో ఎలాంటి వివరాలు వెల్లడించలేమని వాషింగ్టన్లోని మెలానియా కార్యాలయం పేర్కొంది.