బీసీలు బీజేపీ దరిదాపులకు కూడా రారని తెలంగాణ మంత్రి మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఉన్నత వర్గాలతో సమానంగా సీఎం కేసీఆర్ బీసీలను పైకి తెచ్చారని చెప్పారు. బీసీలంతా బీజేపీ వైపే ఉన్నారని బీజేపీ నేత లక్ష్మణ్ అనడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి ఎద్దేవాచేశారు. కేసీఆర్తో బీసీల బంధం విడదీయరానిదని అన్నారు. మార్కెట్ కమిటీల్లో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు.
ఐదేళ్లలో బీసీల కోసం 26 వేల 500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.17 కులాలను కేసీఆర్ బీసీ జాబితాలో చేర్చారని గుర్తుచేశారు. కేసీఆర్ సీఎం అయ్యాక 261 గురుకులాలను ఏర్పాటు చేశారన్నారు. 95వేల మంది వెనుకబడిన వర్గాల విద్యార్థులు అందులో చదువుతున్నారని చెప్పారు భూమ్మీద టీఆర్ఎస్ ఉన్నంత వరకు బీసీలు కేసీఆర్ వెంటే ఉంటారని మంత్రి వ్యాఖ్యానించారు.