telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఐపీఎల్ 2020 : మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకున్న ముంబై..

అబుదాబి వేదికగా ఐపీఎల్ 2020 లో ఈ రోజు ముంబై ఇండియన్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ కీరన్ పోలార్డ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో మొదట బ్యాటింగ్ కు వచ్చిన బెంగళూరు జట్టులో ఓపెనర్ దేవదత్ పడిక్కల్(74) అర్ధశతకంతో రాణించడంతో ఆ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఇక 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన ముంబై జట్టులో ఓపెనర్లు ఇషాన్ కిషన్ (25), క్వింటన్ డి కాక్ (18) పరుగులకే పెవిలియన్ కు చేరుకుంటే తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (79*) అంద్భుతంగా రాణించాడు. వచ్చినవారు వచ్చినట్లు ఔట్ అవుతున్న ఆచితూచి షాట్స్ ఆడటంతో ముంబై 19.1 ఓవర్లలోనే 5 వికెట్ల నష్టానికి ఈ మ్యాచ్ లో విజయం సాధించింది. అంతే కానుండ మొత్తం ఈఏడాది ఐపీఎల్ లో 8 విజయాలు సాధించి 16 పాయింట్లతో ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకోవడంతో పాటుగా పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి వచ్చింది. ఇక వారుండగా రెండో ఓటమి చవిచూసిన బెంగళూరు పాంట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది,

Related posts