ఇటీవల జరిగిన ఎన్నికల్లో గుంటూరు జిల్లా నరసరావు పేట నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున బరిలోకి దిగి ఓటమి పాలైన డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణతో ఆయన భేటీ అయ్యారు. బీజేపీలో చేరే విషయమై వీరిద్దరి మధ్యా చర్చలు జరిగినట్టు తెలుస్తున్నాయి.
గుంటూరులోని కన్నా నివాసానికి వచ్చిన ఆయన, దాదాపు ఆరగంటకు పైగా సమావేశం అయ్యారు. కాగా, గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ నాయకులను ఆకర్షించే పనిలో ఉన్న బీజేపీ, ఆ పనిని రాష్ట్ర నాయకులకు అప్పగించగా, పలువురు టీడీపీ స్థానిక నాయకులతో బేజేపీ నేతలు చర్చలు సాగిస్తున్నారు. అతి త్వరలోనే చదలవాడ బీజేపీలో చేరుతారని సమాచారం.
వైసీపీ నేతలు చెబితేనే కార్యాలయాల్లో పనులు: చంద్రబాబు