ఎన్నికల నగారా మోగటంతో అన్ని పార్టీలు వారి అభ్యర్థుల జాబితా లపై మల్లగుల్లాలు పడుతున్న విషయం తెలిసిందే. ఆ జాబితాలను నేడు విడుదల చేస్తాం, లేదు రేపు విడుదల చేస్తాం అంటూ.. ఒక్కో పార్టీ నీళ్లు నములుతుంది. ఇక ఏపీలో మరో పార్టీగా గుర్తింపు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్న జనసేన మాత్రం తన అభ్యర్థుల జాబితాను విడుదల చేసేసింది. ఈ తొలిజాబితాలో 32 మందికి స్థానం దక్కింది. ఇందులోనే 4 స్థానాలకు లోక్ సభ అభ్యర్థులను కూడా ప్రకటించడం విశేషం. అయితే భవిష్యత్తులో వీటిలో మార్పులు ఉంటాయా .. అంటే మాత్రం సమాధానం లేని స్థితి.
ఆ 32 అభ్యర్థులు వీరే :
పార్లమెంటు అభ్యర్థులు: డీఎంఆర్ శేఖర్(అమలాపురం), ఆకుల సత్యనారాయణ (రాజమండ్రి), గేదెల శ్రీనుబాబు (విశాఖపట్నం), చింతల పార్ధసారథి (అనకాపల్లి)
అసెంబ్లీ అభ్యర్థులు: సుందరపు విజయ్కుమార్(యలమంచిలి), నక్కా రాజబాబు (పాయకరావుపేట), పసుపులేటి బాలరాజు(పాడేరు), ముచ్చా శ్రీనివాసరావు (రాజాం), కోరాడ సర్వేశ్వరరావు(శ్రీకాకుళం), కోత పూర్ణచంద్రరావు(పలాస), బాడన వెంకట జనార్దన్(జనా- ఎచ్చెర్ల), లోకం నాగమాధవి (నెల్లిమర్ల), రాజా అశోక్బాబు (తుని), కందుల దుర్గేష్ ( రాజమండ్రి సిటీ), రాపాక వరప్రసాద్ ( రాజోలు), పాముల రాజేశ్వరి (పి.గన్నవరం), ముత్తా శశిధర్ (కాకినాడ సిటీ), రేలంగి నాగేశ్వరరావు (అనపర్తి), పితాని బాలకృష్ణ (ముమ్మిడివరం), వేగుళ్ల లీలాకృష్ణ(మండపేట), బొలిశెట్టి శ్రీనివాస్ (తాడేపల్లిగూడెం), నవుడు వెంకటరమణ (ఉంగుటూరు), రెడ్డి అప్పలనాయుడు (ఏలూరు), నాదెండ్ల మనోహర్ (తెనాలి), తోట చంద్రశేఖర్(గుంటూరు వెస్ట్), రావెల కిషోర్బాబు (పత్తిపాడు), ఎ.భరత్ భూషణ్ (వేమూరు), సయ్యద్ జిలానీ(నరసరావుపేట), పసుపులేటి సుధాకర్ ( కావలి), చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి (నెల్లూరు రూరల్), మల్లికార్జునరావు (ఆదోని ), మధుసూదన్రెడ్డి (ధర్మవరం), పత్తిపాటి కుసుమకుమారి (రాజంపేట), బోనాసి వెంకటసుబ్బయ్య (రైల్వే కోడూరు), బోడే రామచంద్ర యాదవ్ (పుంగనూరు), బండి రామకృష్ణ (మచిలీపట్నం)