ఫోన్కు చార్జింగ్ పెట్టి మాట్లాడటం, రాత్రి సమయంలో చార్జింట్ పెట్టి వదిలేయడం ప్రమాదకరమని ఎన్నో సార్లు చదువుతూనే ఉన్నాం. అయినప్పటికీ.. ఎంతో మంది ఈ ఘటనల కారణంగానే ప్రాణాలను కోల్పోతున్నారు. తాజాగా కజికిస్థాన్కు చెందిన 14 ఏళ్ల బాలిక సెల్ఫోన్ పేలి మృతిచెందింది. వివరాల్లోకి వెళ్తే.. కజికిస్థాన్లోని బెస్టోబ్ ప్రాంతానికి చెందిన బాలిక రాత్రి పాటలు విని ఫోన్కు చార్జింగ్ పెట్టి నిద్రపోయింది. తెల్లవారుజామున సెల్ఫోన్ చార్జింగ్ ఫుల్ అయిపోయి బ్యాటరీ హీట్ ఎక్కిపోవడంతో ఒక్కసారిగా పేలిపోయింది. బాలిక సెల్ఫోన్ను తల దగ్గరే పెట్టుకుని నిద్రపోవడంతో.. తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందినట్టు చెబుతున్నారు. అయితే సెల్ఫోన్ ఏ కంపెనీకి చెందినది అనేది తెలియాల్సి ఉంది. కాగా, సెల్ఫోన్ను చార్జింగ్ పెట్టి నిద్రపోవద్దంటూ మొబైల్ కంపెనీలు కూడా హెచ్చరిస్తూనే ఉన్నాయి.
previous post
టీడీపీ ఉక్కు పరిశ్రమను రాజకీయంగా వాడుకుంది: కన్నా