బీసీసీఐకి రూ.100కోట్ల జరిమానా విధించాలని బాంబే హైకోర్టులో ఓ పిటీషన్ దాఖలైంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారత్లో కరోనా మరణాలు, పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకొని ఐపీఎల్ 14వ సీజన్ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను బాంబే కోర్టు మంగళవారం విచారణకు స్వీకరించింది. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో ఐపీఎల్ 2021ను నిర్వహించడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు బీసీసీఐకి రూ.100 కోట్ల ఫైన్ వేయాలని పిటీషన్లో కోరారు. అలాగే ఐపీఎల్ 2021 ద్వారా వచ్చే లాభాలను కరోనా చికిత్సకు అవసరమైన ఔషధాలు, మెడికల్ ఆక్సిజన్ సరఫరా కోసం ఉపయోగించేలా ఆదేశాలివ్వాలని న్యాయస్థానాన్ని వారు కోరారు. ఇక డివిజన్ బెంచ్ చీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ జిఎస్ కులకర్ణి గురువారం ఈ విషయాన్ని విచారించడానికి అంగీకరించారు. మరి బాంబే హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఐపీఎల్లోని పలు జట్ల ఆటగాళ్లు కరోనా వైరస్ బారిన పడుతుండటంతో బీసీసీఐ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్ను ఐపీఎల్ మ్యాచ్లను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్ల ప్రకటించారు.
previous post
next post