తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిని దూషించిన కేసులో నలుగురి టీడీపీ నేతల పై పోలీసులు కేసు నమోదు చేశారు. తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి వినాయక మండపం వద్ద పూజ చేసే సమయంలో టీడీపీ నేతలు దూషించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
దళితులు పూజ చేస్తే దేవుడికి మైల అంటుతుందని టీడీపీకి చెందిన వారు దూషించారని ఎమ్మెల్యే కన్నీళ్లు పెట్టుకొన్నారు. ఈ ఘటన పై ఎమ్మెల్యే శ్రీదేవి ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు మంగళవారం కొమ్మినేని శివయ్య, సాయి, రామకృష్ణ, బుజ్జిలపై కేసు కేసు నమోదు చేశారు.