telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

టీడీపీ నేతల దూషణలతో వైసీపీ ఎమ్మెల్యే కంటతడి.. నలుగురిపై కేసు నమోదు

undvalli sridevi ycp mla

తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిని దూషించిన కేసులో నలుగురి టీడీపీ నేతల పై పోలీసులు కేసు నమోదు చేశారు. తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి వినాయక మండపం వద్ద పూజ చేసే సమయంలో టీడీపీ నేతలు దూషించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

దళితులు పూజ చేస్తే దేవుడికి మైల అంటుతుందని టీడీపీకి చెందిన వారు దూషించారని ఎమ్మెల్యే కన్నీళ్లు పెట్టుకొన్నారు. ఈ ఘటన పై ఎమ్మెల్యే శ్రీదేవి ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు మంగళవారం కొమ్మినేని శివయ్య, సాయి, రామకృష్ణ, బుజ్జిలపై కేసు కేసు నమోదు చేశారు. 

Related posts