telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

టీ కాంగ్రెస్‌కు షాక్.. టీఆర్ఎస్ లోకి మరో ఎమ్మెల్యే!

congress leaders cleared on joining in trs party
ఈ నెల 12న ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఖమ్మం జిల్లా పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు కాంగ్రెస్ పార్టీని వీడనున్నారు. వారిద్దరు  టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 
తాజాగా మరో ఎమ్మెల్యే  కారు ఎక్కడానికి సిద్ధమయ్యారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా  టీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.  సీఎం కేసీఆర్‌ని కూడా చిరుమర్తి  కలిసి మాట్లాడినట్టు సమాచారం. రెండు మూడు రోజుల్లో  టీఆర్‌ఎస్‌లో చిరుమర్తి చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఆ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్ రెడ్డి చొరవ తీసుకుని చిరుమర్తితో సంప్రదింపులు చేసినట్టు తెలుస్తోంది.  ఈ పరిణామాల నేపథ్యంలో చిరుమర్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన ఫోన్ సైతం స్విచ్‌ఆఫ్  చేసుకున్నట్లు సమాచారం.

Related posts