telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

సింధును అభినందించిన కేంద్ర క్రీడల మంత్రి

pv sindhu player

స్విట్జ‌ర్లాండ్‌లో జ‌రిగిన వ‌ర‌ల్డ్ బ్యాడ్మింట‌న్ చాంపియ‌న్‌షిప్‌లో స్వ‌ర్ణ ప‌త‌కం గెలిచిన తెలుగుతేజం సింధు సోమవారం ఇండియాలో అడుగుపెట్టింది. ఢిల్లీలో కేంద్ర క్రీడా మంత్రి కిర‌ణ్ రిజిజును క‌లుసుకున్న‌ది. పీవీ సింధు సాధించిన ఘ‌న‌త‌ను మంత్రి మెచ్చుకున్నారు. తొలిసారి వ‌ర‌ల్డ్ బ్యాడ్మింట‌న్ చాంపియ‌న్‌షిప్‌లో స్వ‌ర్ణ‌ప‌త‌కం సాధించిన భార‌త క్రీడాకారిణిగా సింధు దేశ గౌర‌వాన్ని పెంచింద‌ని అభినంధించారు.

దేశానికి ఆమె మ‌రిన్ని ప‌త‌కాలు అందించాలంటూ మంత్రి త‌న ట్విట్ట‌ర్‌లో ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు. ఈ మధ్యాహ్నం హైదరాబాద్ కు చేరుకోనుంది. హైదరాబాద్ లో సిందుకు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. విమానాశ్రయం నుంచి ఓపెన్ టాప్ వాహనంలో ఆమెను గచ్చిబౌలి వరకూ ఊరేగింపుగా తీసుకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది.

Related posts