telugu navyamedia
సినిమా వార్తలు

రిస్క్ తప్పదంటున్న పూజాహెగ్డే

Pooja-Hegde

ప్రస్తుతం తెలుగులో చాలా బీజీగా ఉన్న బాలీవుడ్ బ్యూటీ పూజాహెగ్డే. వరుణ్ తేజ్ సరసన “ముకుంద” సినిమాలో హీరోయిన్ గా నటించి తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అల్లు అర్జున్ తో “దువ్వాడ జగన్నాథం” సినిమాలో బికినీ ట్రీట్ ఇచ్చింది. ఇక ఎన్టీఆర్‌తో “అరవింద సమేత”, ఇటీవలే మహేష్‌ బాబుతో కలసి “మహర్షి”లో చేసి మంచి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం తెలుగు స్టార్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తోంది. ఈ క్రమంలో పూజాహెగ్డే మాట్లాడుతూ “సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేందుకు నేనెప్పుడూ ముందే ఉంటాను. జీవితంలో సాహసాలు చేయడం చాలా అవసరం. అవే మనల్ని అందరిలో ప్రత్యేకంగా నిలబెడతాయి. కంఫర్టబుల్‌గా జీవితాన్ని ఆస్వాదించడంలోనే ఆనందం ఉందనుకుంటారు చాలామంది. అందుకే ఒకే రకమైన లైఫ్‌కు అలవాటు పడిపోతుంటారు. అయితే అలా బతకడంలో తప్పు లేదు. కానీ మనకంటూ ఓ గుర్తింపు రావాలంటే పదిమందికంటే భిన్నంగా ఆలోచించాల్సిందే. అయితే కొత్తదారిలో ఎదురుదెబ్బలు తగులుతాయి. వాటిని తట్టుకుని నిలబడాలి. సినిమాలు మనకెందుకు అనుకుంటే చాలామంది అమ్మాయిల్లానే నేనూ చదువు, ఉద్యోగం అంటూ మిగిలిపోయేదాన్ని. కాని ‘ఓసారి ట్రై చేసి చూద్దాం’ అని గట్టిగా అనుకున్నాను అంతే.. అయితే ఈ ప్రయాణంలో మొదట కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ చివరికి మాత్రం నా గమ్యాన్ని చేరుకున్నా” అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.

Related posts