తమిళనాడులో తెలంగాణ కబడ్డీ ఆటగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పుదుచ్చేరిలో కబడ్డి టోర్నమెంట్ ఆడి తిరిగివస్తుండగా టికెట్ విషయంలో బస్సు కండక్టర్తో గొడవ జరిగింది. అన్నాసలైలో బస్సు ఎక్కిన తెలంగాణ ఆటగాళ్లు ఎగ్మూర్లో బస్సు దిగారు. ఈ క్రమంలో టికెట్ విషయంలో గొడవకు దిగిన తెలంగాణ ఆటగాళ్లపై కండక్టర్ దాడి చేశాడు.
ఈ దాడిలో కబడ్డి కోచ్ లక్ష్మణకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. ఈ దాడి జరిగిన తీరును స్థానికులు సెల్ఫోన్ సాయంతో వీడియో తీశారు. విషయం తెలుసుకున్న ఎగ్మూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటన పై ఆరా తీసి, తెలంగాణ కబడ్డి ఆటగాళ్లను ఆదుపులోకి తీసుకున్నారు.
కేసీఆర్, కేటీఆర్ నిర్వహించిన శాఖలు చివరిస్థానంలో ఉన్నాయి: రేవంత్ రెడ్డి