telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

దొంగతనానికి వెళ్లిన ఇంట్లో షాక్ కొట్టి చనిపోయిన దొంగ …’

Thief

కర్ణాటక రాష్టం బీదర్ ప్రాంతాన్ని చెందిన ముగ్గురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి శివారు ప్రాంతంలో ఉండే కంపెనీ లకు చెందిన విద్యుత్ ట్రాన్స్ఫార్మ ల ను పగలగొట్టి, వాటి లో ఉండే రాగి తిగాను దొంగతనం చేసేవారు. అదేవిధంగా మల్కాపూర్ గ్రామ శివారు లోని సిమెంట్ ఇటుకల కంపెనీలో ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ ను విద్యుత్ ని నిలిపి వేసి ,రాగి తీగను దొంగతనం చేయడానికి  ఈ నెల 19 వ తేదీన ప్రయత్నం చేయగా ,ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రసారం కావడంతో ముగ్గురు దొంగల లో సంగమేశ్వర్ (22) అనే దొంగ అక్కడే మృతి చెందాడు. షాక్ తో మిగతా ఇద్దరు పరారీ అయ్యారు.  మళ్ళీ రెండు రోజుల తరువాత ఆ మృతదేహాని తీసుకెళ్లడానికి ప్రయత్నం చేసి నా సఫలం కాలేదు. ఆ ట్రాన్స్ఫార్మర్స్ కంపెనీ చివరన ఉండడటంతో కంపెనీ వాళ్ళు కుడా చూడలేదు. మృతదేహాని తీసుకపోవడం కష్టం గా మారడంతో ఛాదర్ ఘాట్ లోని  పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేస్ నమోదు చేశారు మిగతా ఇద్దరు దొంగలు. పలు కోణాల్లో పోలీస్ లు ఈ కేస్ విషయం లో విచారణ చేయగా, పిర్యాదు దారులు పొంతన లేని సమాదానాలు చెప్పడంతో, అనుమానం వచ్చిన పోలీస్ లు పిర్యాదుదారులని విచారించడం తో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఛాదర్ ఘాట్  పోలీస్ లు చౌటుప్పల్ పోలీస్ లకి సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని హాస్పిటల్ కి తరలించారు.

Related posts