నార్త్ కరోలినా నుంచి న్యూజెర్సీలోని నెవార్క్కు వెళ్తున్న స్పిరిట్ ఎయిర్లైన్స్కు చెందిన విమానంలో భయానక సంఘటన చోటు చేసుకుంది. విమానంలో గబ్బిలం ప్రత్యక్షం కావడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. దాదాపు అర్ధ గంటసేపు అది విమానంలో అటు ఇటూ తిరిగింది. దీంతో కొందరు భయంతో పరుగులు పెట్టారు. మరికొందరు గబ్బిలం బారిన పడకుండా ఉండేందుకు వాష్రూమ్ల్లో వెళ్లి లాక్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఇద్దరు ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్గా మారింది. ఈ ఏడాది ఇలా జరగడం ఇది రెండోసారి అని, మళ్లీ తాను స్పిరిట్ ఎయిర్లైన్స్లో ప్రయాణించేది లేదని ఓ ప్రయాణికుడు పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
previous post
ఎన్నికల్లో జనసేన ఓటమి… స్పందించిన చరణ్