telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

మహేష్‌ బాబు తో ఉన్న ఫోటో షేర్ చేసిన రన్ వీర్ సింగ్…

టాలీవుడ్ హీరో మహేష్ బాబుకు ఎంత మంది అభిమానులు ఉన్నారో అందరికి తెలుసు. అలాగే దేశ మొత్తంలో మహేష్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరో వైపు టీవీ ప్రకటనలపై కూడా దృష్టి పెట్టాడు. మహేష్ ఇప్పటికే పలు బ్రాండ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఫేమస్ కూల్‌డ్రింక్ థమ్స్‌అప్‌కి కూడా బ్రాండ్ అంబాసిడర్‌గా చేస్తున్నా విషయం తెలిసిందే. అయితే థమ్స్ అప్‌కు బాలీవుడ్‌లో రన్ వీర్ సింగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా చేస్తున్నాడు. ఇటీవల వీరిద్దరూ కలిసి ఒక ప్రకటనలో చాశారు. ఈ విషయాన్ని రన్ వీర్ తన ఇస్టాగ్రామ్ ద్వారా షేర్ చేశాడు. దానికి వారు కలిసి ఉన్న ఓ ఫొటోను కూడా జత చేశాడు. మహేష్ ఒక జెంటిల్‌మ్యాన్.. అతడితో కలిసి చేయడం చాలా ఆనందంగా ఉంది. తాను నటించి ఇంత సంతోషపడిన వారిలో మహేష్ ఒకడు. బిగ్ బ్రదర్‌తో మరోసారి నటించేందుకు చూస్తున్నాని ఆ పోస్ట్‌లో రాశాడు. అయితే వీరిద్దరు ముంబైలో షూటింగ్ చేస్తుండగా వీరి కాంబోలో ఓ భారీ మల్టీస్టారర్ సినిమా తెరకెక్కనుందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలు నిజయితే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు.

Related posts