రాయలసీమ ప్రాజెక్టుపై మాట్లాడిన సీఎం కేసీఆర్.. ప్రాణం పోయినా సరే నీళ్ల విషయంలో రాజీపడే సమస్య ఉత్పన్నం కానేకాదని స్పష్టం చేశారు.. రాయలసీమ ప్రాజెక్టుపై అన్ని రకాలుగా ఫైట్ చేస్తామన్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్ సర్కార్ తలపెట్టిన రాయలసీమ ప్రాజెక్టుపై స్టేలు కూడా ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తుచేసిన సీఎం కేసీఆర్.. జాతీయ హరిత ట్రిబ్యునల్ కూడా స్టే ఇచ్చిందని.. ఈ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వానికి తాము ఫిర్యాదు చేశామన్నారు. ఆ ప్రాజెక్టు పూర్తి అసంబద్ధమైనదని కేంద్రానికి చెప్పామని వెల్లడించిన కేసీఆర్.. అన్ని రకాలుగా ఫైట్ చేస్తాం.. దాన్ని వదిలిపెట్టే ప్రసక్తేలేదన్నారు. అసలు రాజీపడే ప్రశ్న ఉత్పన్నం కానేకాదన్నారు. అవసరమైతే అసెంబ్లీ మొత్తం ఢిల్లీలో కూర్చొనైనా.. పోరాడుతాం.. కానీ, మన నీటి హక్కుల విషయంలో రాజీపడబోమన్నారు కేసీఆర్. ఆంధ్రప్రదేశ్ చిలిపి పనులు చేస్తుందని మండిపడ్డ సీఎం కేసీఆర్.. తెలంగాణ మునుపటి లెక్క దిక్కు లేనిది కాదు… మేం స్వాతంత్ర రాష్ట్రం అని గుర్తుచేశారు. 15 టీఎంసీల నీళ్లు ఆర్డీఎస్ నుండి తీసుకుంటామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. చూడాలి మరి ఏం జారుతుంది అనేది.
previous post
next post