telugu navyamedia
వార్తలు

రాపాక రావద్దు అని పెట్టిన ఫ్లెక్సీలపై స్పందించిన నాదెండ్ల మనోహర్…

గత ఏడాది ఏపీలో జరిగిన ఎన్నికలో పవన్ కళ్యాణ్ జనసేన తరపున గెలిచినా ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌. అయితే ఇప్పుడు రాపాకకు సొంత నియోజకవర్గంలో కేడర్‌ షాకిచ్చింది. పార్టీ సభకు రావొద్దంటూ జనసైనికులు ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది. తూర్పు గోదావరి జిల్లా మలికిపురంలో నిర్వహించే జనసేన సభకు రాపాక రావొద్దంటూ ఫ్లెక్సీ పెట్టారు. ఈ సభకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ హాజరు కావాల్సిన సభలో ఈ ఘటన చోటు చేసుకుంది.. అయితే, తాము ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే రాపాకకు అనుమతి లేదన్నారు జనసేన కార్యకర్తలు. మరోవైపు.. జనసేన సభ వద్ద ఎమ్మెల్యే రాపాకకు  నోఎంట్రీ  ఫ్లెక్సీ ఏర్పాటుపై స్పందించిన నాదెండ్ల మనోహర్.. మా పార్టీ ఎమ్మెల్యేగా రాపాకపై పోలీసులు అక్రమ కేసులు పెడితే పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాజోలులో వచ్చి అండగా నిలిచారని గుర్తుచేశారు. అయితే, ఇప్పుడు రాపాక అధికార పార్టీతో కలసి రాజోలులో జనసేన కార్యకర్తలపై కేసులు పెట్టడం ఏంటని..? ఇది సరైన పద్దతి కాదన్నారు నాదెండ్ల మనోహర్. అయితే మరి దీని పై రాపాక ఏ విధంగా స్పందిస్తాడు అనేది చూడాలి.

Related posts