telugu navyamedia
క్రీడలు వార్తలు

వారిని చూస్తే సచిన్-సెహ్వాగ్ జోడి గుర్తుకు వచ్చింది : వాన్

రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీలు ఒకప్పటి వీరేందర్ సెహ్వాగ్-సచిన్ టెండూల్కర్ జోడీని గుర్తుకుతెచ్చారని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ వాన్ అభిప్రాయపడ్డాడు. టీ20ల్లో భారత జట్టుకి అత్యుత్తమ ఓపెనింగ్ జోడీ రోహిత్-కోహ్లీలే అని చెప్పాడు. అయితే ఇంగ్లాండ్ తో జరిగిన చివరి టీ20 సిరీస్ లో రోహిత్ తో కలిసి కోహ్లీ ఓపెనింగ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో ఇన్నింగ్స్ మొదటి ఓవర్ నుంచే దూకుడుగా ఆడిన కోహ్లీ, రోహిత్.. పోటీపడి మరీ పరుగులు చేశారు. ఈ క్రమంలోనే తొలి వికెట్‌కి 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రోహిత్ ఔటైనా.. కోహ్లీ చివరి వరకూ క్రీజులో నిలిచి టీమిండియాకు భారీ స్కోర్ అందించాడు. తాజాగా మైకేల్ వాన్ భారత టీ20 ఓపెనింగ్ జోడిపై స్పందించాడు. ‘సరైన బ్యాటింగ్ ఆర్డర్‌‌ కోసం కొన్నిసార్లు అదృష్టం కూడా ఉండాలి. టీమిండియాకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ‌ జోడీ రూపంలో అదృష్టం కలిసొచ్చింది. కోహ్లీ-రోహిత్ జోడీ నాకు ఒకప్పటి సచిన్-సెహ్వాగ్ ఓపెనింగ్ జోడిని గుర్తుకుతెచ్చింది’ అని వాన్ పేర్కొన్నాడు. అయితే ఈ రెండు జట్ల మధ్య నేటి నుండి వన్డే సిరీస్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే.

Related posts