కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వ్యాక్సిన్ వచ్చినప్పటికీ… ఈ కరోనా మహమ్మారి అందరికీ చుక్కలు చూపిస్తోంది. ఈ వైరస్ ఎవరినీ వదలడం లేదు. ప్రస్తుతం ఈ వైరస్ క్రికెటర్లను వెంటాడుతోంది. ఇప్పటికే సచిన్, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, బద్రీనాథ్ లకు కరోనా సోకిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఇండియా మహిళల జట్టు టీ 20 కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సైతం కరోనా బారిన పడింది. జ్వరం రావడంతో సోమవారం కరోనా పరీక్షలు చేయించుకున్న ఆమెకు… రిపోర్టులో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో హర్మన్ స్వీయ నిర్భంధంలోకి వెళ్లినట్లు ఆమె సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆమె బాగానే ఉన్నారని.. త్వరలోనే కోలుకుంటారని తెలిపాయి. కాగా ఇటీవల స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సరీస్లో హర్మన్ ప్రీత్ కౌర్ ఆడారు.