ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజుల క్రితం సిరివెన్నెల అనారోగ్యానికి గురి కావడంతో ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్ కిమ్స్ హస్పిటల్లో చేర్చారు.
న్యుమోనియాతో బాధపడుతున్న సిరివెన్నెల ఆరోగ్యం ఆందోళన కరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనను కిమ్స్ వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లుగా సమాచారం. ఆయన త్వరగా కోలుకోవాలని సినీ నటీనటులు, చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు కోరుకుంటున్నారు.
సమంతపై “జెర్సీ” హీరోయిన్… నెటిజన్లు ఫైర్