విజయవాడకు చెందిన ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) నేడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మల్లాది విష్ణుతో కలిసి నేటి ఉదయం ఆయన హైదరాబాద్లోని లోటస్పాండ్కు చేరుకున్నారు. అనంతరం వరప్రసాద్కు పార్టీ కండువా కప్పి వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాలోకి ప్రజలకు సేవ చేద్దామని వచ్చానన్నారు. విజయవాడ పార్లమెంట్ నుంచి వైసీపీ తరపున పోటీ చేయబోతున్నానని పీవీపీ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్తో పాటు అందరూ తన మిత్రులేనన్నారు. జగన్తోనే ప్రజలకు మేలు జరుగుతుంది అని నమ్ముతున్నానని పీవీపీ పేర్కొన్నారు.
previous post