అందాల నయనతార వివిధ భాషలలో వరుస సినిమాలతో బిజీగా దూసుకుపోతుంది. ప్రత్యేకమైన పాత్రలు చేస్తూ తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడున్న నటీమణుల్లో అత్యంత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటీమణిగా కూడా నయనతార ఓ అరుదైన గుర్తింపును సంపాదించుకుంది.
ఇకపోతే ..నిత్యం ఏదో రకంగా వార్తల్లో నిలుస్తున్న ఈ అమ్మడు ..ప్రస్తుతం విఘ్నేష్ శివన్తో ప్రేమలో మునిగితేలుతుంది. ఈ ఏడాది ప్రారంభంలో వారి కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్ధం చేసుకున్న నయన్-విఘ్నేశ్ వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకోనున్నారని సమాచారం.
తాజాగా కోలీవుడ్లో మరో వార్త తెగ చక్కర్లు కొడుతోంది. చెన్నైలోని పోయెస్ గార్డెన్లో నాలుగు పడక గదులతో ఉన్న ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిందట. నటి త్వరలో తన కాబోయే భర్త విఘ్నేష్ శివన్తో కలిసి తన కొత్త ఇంటికి మాకం మార్చనుందని సమాచారం.
పోయెస్ గార్డెన్ చెన్నైలోని నాగరిక ప్రదేశాలలో ఒకటి. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, రజనీకాంత్లకు పోయెస్ గార్డెన్లో నివాసాలు ఉన్నాయి. పోయెస్ గార్డెన్లో రజనీకాంత్ ఇంటి పక్కనే ధనుష్ కూడా ఓ ఇల్లు కూడా నిర్మిస్తున్నాడు.
నయనతార ఇటీవలే 37 ఏళ్లు పూర్తి చేసుకుంది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, నయనతార, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ‘కాత్తు వాక్కుల రెండు కాదల్, సినిమా సెట్లో తన ప్రియుడు విఘ్నేష్ శివన్తో కలిసి తన పుట్టినరోజును జరుపుకుంది.
చెన్నైలోని పోయెస్ గార్డెన్లో నయనతార భారీ మొత్తంలో కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం. అలాగే ఆమె అదే ప్రాంతంలో మరో ఇంటిని కొనుగోలు చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.