మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతోన్న మూడో చిత్రం ‘క్రాక్’. ఇదివరకు ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ‘డాన్ శీను’, ‘బలుపు’ సినిమాలు విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు వీరిద్దరూ హ్యాట్రిక్పై కన్నేశారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న ‘క్రాక్’ మూవీలో శ్రుతి హాసన్ నాయికగా నటిస్తున్నారు. ప్రముఖ తమిళ నటులు సముద్రకని, వరలక్ష్మీ శరత్కుమార్ పవర్ఫుల్ క్యారెక్టర్లు పోషిస్తున్నారు. దేవీ ప్రసాద్, చిరగ్ జాని, మౌర్యని, సుధాకర్ కోమాకుల, వంశీ చాగంటి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్పై బి. మధు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఎస్. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ‘మెర్సల్’, ‘బిగిల్’ వంటి బ్లాక్బస్టర్ సినిమాలకు పనిచేసిన జి.కె. విష్ణు సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగులు రాశారు. లాక్ డౌన్ ముందే సగం షూటింగ్ పూర్తికాగా ఈమధ్యే తిరిగి చిత్రీకరణ స్టార్ట్ చేశారు టీమ్. ఇప్పటికే ఆలస్యం కావడంతో వేగంగా షూటింగ్ కానిచ్చారు. అయితే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను రీషూట్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ చిత్రబృందం తాజా అప్డేట్ తో వాటికి చెక్ పెట్టేసింది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే కంప్లీట్ అవుతుంది. ఇప్పటికే టాకీ పార్ట్ షూటింగ్ ను ముగించిన రవితేజ సాంగ్స్ షూట్ కోసం రెడీ అవుతున్నారు.
previous post
next post
సల్మాన్ తో నా అనుబంధం ప్రత్యేకం : కత్రినా కైఫ్