telugu navyamedia
రాజకీయ వార్తలు సినిమా వార్తలు

ఆ కేసుల పై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి: కమలహాసన్

Kamal-Hassan

మూకదాడులు, విద్వేష ప్రచారాలను వ్యతిరేకిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రధానికి బహిరంగ లేఖ రాసిన 49 మంది ప్రముఖులపై దేశద్రోహం కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసుల పై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినే కమలహాసన్ ఆందోళన వ్యక్తం చేశారు. వరుస ట్వీట్లు చేస్తూ ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. దేశం సామరస్యంగా ఉండాలన్న ప్రధాని మోదీ ఆశయాలకు ఇది పూర్తిగా విరుద్ధమని పేర్కొన్నారు.

దేశం సామరస్యంగా ఉండాలని మోదీ కోరుకుంటారని, పార్లమెంటులో ఆయన ప్రసంగాలు విన్న వారికి ఇది అర్థమవుతుందని అన్నారు. మరి ఆయన ఆశయాలకు విరుద్ధంగా ఎలా ప్రవర్తిస్తారని కమల్ ప్రశ్నించారు. ప్రముఖులపై నమోదైన కేసుల విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని ఓ పౌరుడిగా తాను కోరుకుంటున్నట్టు కమల్ ట్విటర్ పేర్కొన్నారు. బీహార్‌లో వీరిపై నమోదైన రాజద్రోహం కేసులను రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కమల్ కోరారు.

Related posts