telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇకనుంచి అక్కడ షూటింగ్ సీఎం అనుమతిస్తేనే…!

Malang

బాలీవుడ్ నటులు ఆదిత్య రాయ్ కపూర్, దిశా పటానీ జంటగా నటించిన సినిమా ‘మలంగ్’. గత శుక్రవారం రిలీజ్ అయిన సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లే రాబడుతోంది. ఈ సినిమాలో దిశాను భుజాలపైకి ఎక్కించుకుని లిప్ కిస్ చేయడం, సముద్రంలో చాలా సేపటి వరకు ముద్దులు పెట్టుకోవడం ఇలా చాలా సన్నివేశాలే ఉన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ ఎక్కువ శాతం గోవాలో తీసారు. ఆదిత్య, దిశా ముద్దు పెట్టుకునే సీన్లు దాదాపు గోవాలోనే షూట్ చేసారు. దాంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ విషయాన్ని ప్రమోద్ మీడియా ద్వారా వెల్లడించారు. “గోవా ప్రభుత్వానికి సంబంధించి ఎంటర్‌టైన్మెంట్ సొసైటీ ఆఫ్ గోవా అనే ఏజెన్సీ ఉంది. ఇక నుంచి గోవాలో ఏ సినిమా షూటింగ్ చేయాలన్నా ఈ ఏజెన్సీ స్క్రిప్ట్ ఓకే చేస్తేనే షూటింగ్ చేసుకోవాలి. లేకపోతే షూటింగ్ వేరే ప్రదేశానికి మార్చుకోవాలి. మలంగ్ సినిమాలో డ్రగ్స్ తీసుకోవడం, రేవ్ పార్టీలు చేసుకోవడం వంటి సన్నివేశాలు చూపించారు. ఇవన్నీ గోవాలో షూట్ చేసారు. సినిమా చూసేవాళ్లు గోవా డ్రగ్స్‌కి రేవ్ పార్టీలకు ఫేమస్ అనుకుంటారు. దాంతో మా రాష్ట్ర ఇమేజ్ పోతుంది. గోవాలో లా అండ్ ఆర్డర్ సమస్య ఎప్పుడూ లేదు. అలాంటప్పుడు మా రాష్ట్రంలో డ్రగ్స్ తీసుకోవడం, రేప్ పార్టీలు వంటివి ఉంటాయని సినిమాల్లో ఎందుకు చూపిస్తారు. ఈసారి ఇలాంటివి కుదరవు. మా రాష్ట్రంలో షూటింగ్ చేసుకోవాలంటే.. గోవాను ఏ రకంగా చూపిస్తున్నారో ఆరా తీసే సినిమాకు అనుమతిస్తాం. అదీకాకుండా నేను అనుమతిస్తేనే గోవాలో ఈ షూటింగ్ చేసినట్లు సినిమా క్రెడిట్స్‌లో నా పేరు వాడారట. అసలు నాకు ఈ విషయం మీడియా వర్గాలు చెప్పే దాకా తెలీదు’’ అని ఆగ్రహం వ్యక్తం చేసారు ప్రమోద్.

Related posts