telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

దొంగ అందరినీ చూసి దొంగదొంగ అని అరిచినట్టుంది: కేశినేని నాని

kesineni nani tdp

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి విరుచుకు పడ్డారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేశ్ కులం, టీడీపీ అధినేత చంద్రబాబు కులం రెండూ ఒకటేనని జగన్ ఆరోపించారు. అందుకే చంద్రబాబు సూచనల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలను ఆయన వాయిదా వేశారంటూ జగన్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

సీఎం జగన్ వ్యాఖ్యలపై కేశినేని నాని మండిపడ్డారు. కులగజ్జి నీకు ఉందని అందరికీ ఆపాదిస్తే… దొంగ అందరినీ చూసి దొంగదొంగ అని అరిచినట్టు ఉందని ఆయన విమర్శించారు. సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని సమర్థించిందని, దానికి ఏమంటావని ప్రశ్నించారు.

Related posts