మరోసారి కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ జమ్మూకశ్మీర్ లో అడుగుపెట్టేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత స్వరాష్ట్రంలో పర్యటించేందుకు ఆజాద్ ఢిల్లీ నుంచి శ్రీనగర్ రాగా ఆయనను ఎయిర్ పోర్టులోనే అడ్డుకున్నారు. తాజాగా ఆయన మరోసారి ప్రయత్నం చేశారు. ఈ మధ్యాహ్నం శ్రీనగర్ వచ్చిన ఆయనను పోలీసులు ఎయిర్ పోర్టు నుంచే తిప్పి పంపారు.
ఇంకా రాష్ట్రంలో పలుచోట్ల ఆంక్షలు ఉండటంతో ఆజాద్ రాకకు అనుమతి ఇవ్వడం కుదరదని పోలీసులు అభ్యంతరం చెప్పారు. తన నివాసానికి వెళ్లేందుకైనా అనుమతించాలని ఆజాద్ కోరినా పోలీసులు అంగీకరించలేదు. పోలీసులతో వాదనకు దిగిన ఈ కాంగ్రెస్ సీనియర్ నేత పార్టీ కార్యాలయం వరకు వెళ్లి వస్తానని చెప్పినా ప్రయోజనం కనిపించలేదు. పోలీసులు ససేమిరా అనడంతో ఆజాద్ కు నిరాశ తప్పలేదు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎవరిని రాష్ట్రంలోకి రానిస్తారని ఆగ్రహంతో ప్రశ్నించారు.
కరోనా వైరస్పై సీఎం జగన్ కొత్త అర్థాలు: సోమిరెడ్డి