టాలీవుడ్ సింగర్ కౌసల్యకు కరోనా పాజిటీవ్ గా తేలింది. దాంతో ఆమె హోం ఐసోలేషన్ లో చికిత్సని తీసుకుంటున్నారు. కాగా ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా లో తెలిపారు. నాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ మహమ్మారి లక్షణాలు తీవ్రం గానే ఉన్నాయి. రెండు రోజుల నుంచి జ్వరం గా ఉంది. కనీసం బెడ్ పై నుంచి కూడా లేవ లేక పోతున్నాను.
ఇప్పుడు గొంతు నొప్పి. నిన్నటి నుంచి మందులు వేసుకోవటం మొదలు పెట్టాను. త్వరలోనే ఈ వైరస్ ను ఓడించి ముందుకు ఎప్పటిలాగే వస్తాను. దయచేసి అందరూ కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి “అంటూ ఎమోషనల్ ట్వీట్ చేసింది. అందరూ తప్పనిసరిగా మాస్క్ లను ధరించాలని కోరారు.