telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సిఎం కెసిఆర్ ది ముందు చూపా.. మందు చూపా…?

టీఆర్ఎస్ పై తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ కేసులను, కోవిడ్ మరణాలను తగ్గించి చూపుతోంది… చనిపోతున్న వారు ప్రభుత్వ చేసిన హత్యలేనని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ది ముందు చూపా మందు చూపా ? అని నిలదీశారు. కేసీఆర్, ktr అబద్ధాలను ఎవరు నమ్మడం లేదని.. ఈటలతో అబద్ధాలు ఆడిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆయుస్మాన్ భారత్ ను వెంటనే అమలు చేయాలి.. మోడీకి పేరు వస్తుందనే అమలు చేయడం లేదన్నారు. చిత్తశుద్ది ఉంటే.. ఆరోగ్య శ్రీలో నైనా చేర్చి…  పేదల ప్రజలను కాపాడాలని దేమంది చేశారు బండి సంజయ్. మునిసిపల్ ఎన్నికల్లో అక్రమ పద్ధతుల్లో గెలిచే ప్రయత్నం చేస్తోంది అధికార పార్టీ అని..ప్రజల ఆశీర్వాదంతో ఎక్కువ సీట్లు గెలుస్తామని పేర్కొన్నారు. పోలీసులు, డీజీపీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి.. క్రిమినల్స్ పై కఠినంగా వ్యవహరించాలని సూచనలు చేశారు. కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది.. రాజకీయంగా కేంద్రంపై విమర్శలు మోపుతుందని ఫైర్ అయ్యారు. ఆస్పత్రిలో డబ్బులో కట్టలేక క్షోభతో చనిపోతున్నారు… దీనికి కూడా కేంద్రమే కారణమా అని నిలదీశారు. యువకులు చనిపోతున్నారు.. వారికి సీఎం కేసీఆర్ భరోసా ఇవ్వడం లేదు..ప్రజలు ఇబ్బందులలో ఉన్నప్పుడు సీఎం ఎప్పుడైనా భరోసా కల్పించాడా అని నిలదీశారు.

Related posts