telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఆ లేఖ నేను రాయలేదు.. ఏపీ ఎస్ఈసీ రమేశ్ కుమార్

Nimmagadda ramesh

కేంద్ర హోమ్ శాఖకు ఏపీ ఎస్ఈసీ రమేశ్ కుమార్ లేఖ రాశారన్న వార్త తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రమేశ్ కుమార్ స్పందించారు. కేంద్ర హోమ్ శాఖకు తాను లేఖ రాయలేదని, తన ప్రాణాలకు ముప్పు ఉందని భావించడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఈ ఉదయం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన, ఆ లేఖ ప్రచారానికి, తనకు సంబంధం లేదని తెలిపారు. లేఖను తాను రాసినట్టుగా సృష్టించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేయనున్నానని ఏపీ ఎస్ఈసీ రమేశ్ కుమార్ వ్యాఖ్యానించారు.

 ఈ ఉదయం పత్రికల్లో రమేశ్ కుమార్ రాసినట్టుగా ఉన్న లేఖకు సంబంధించిన ఏపీలో ఎన్నికలను వాయిదా వేయాలని తాను నిర్ణయించిన తరువాత, బెదిరింపులు పెరిగాయని, తనకు ప్రాణహాని ఉందని, భద్రతను కల్పించాలని ఆయన హోమ్ శాఖను కోరినట్టుగా లేఖలో ఉంది. ఈ లేఖ ఎక్కడి నుంచి వచ్చింది? దీన్ని సృష్టించిన వారు ఎవరు? అన్న అంశాలపై పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు.

Related posts