విజయనగరం జిల్లాలో కోదండరామస్వామి విగ్రహ ధ్వంసం ఘటనకు నిరసనగా బీజేపీ, జనసేన తలపెట్టిన రామతీర్థ ధర్మయాత్ర తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నేతలు సిద్దమవుతుండగా… ఇప్పటికే కొందరిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. రామతీర్థం సందర్శనకు వెళ్లకుండా స్థానిక రామతీర్థం కూడలి వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులు అడ్డుకున్నారు. సెక్షన్ 30 అమల్లో ఉన్నందున ఎలాంటి ర్యాలీలు నిర్వహించకూడదని పోలీసులు ఆదేశించారు. ఇందులో భాగంగానే సోము వీర్రాజును ముందస్తుగా అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. సోము వీర్రాజుతో పాటు పలువురు బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట కూడా చోటు చేసుకుంది.
previous post
next post
“కాళేశ్వరం” నుంచి బొట్టు నీరు కూడా వినియోగంలోకి రాలేదు: ఎమ్మెల్సీ జీవన్రెడ్డి