తెలంగాణలో ఈ నెల11 తర్వాత మరో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగియగానే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. దీనికి సంబంధించి జిల్లా అధికారులకు ఇప్పటికే సమాచారం ఇచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మంగళవారం జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ను ఈ నెల 11 తర్వాత ఎప్పుడైనా విడుదల చేస్తామని ఆయన స్పష్టం చేసినట్లు తెలిసింది. పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ఈ నెల 7లోగా సన్నాహాలు చేయాలని సూచించారు. ఆ తర్వాత డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని, పోలింగ్ స్టేషన్ల ఏర్పాటులో అభ్యంతరాలు వస్తే స్వీకరించాలని చెప్పారు.
next post
తన కుటుంబానికి రక్షణ కల్పించకపోతే ఆందోళన: కోడెల