telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

“కాళేశ్వరం” నుంచి బొట్టు నీరు కూడా వినియోగంలోకి రాలేదు: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

jeevan-reddy

తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి బొట్టు నీరు కూడా వినియోగంలోకి రాలేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. సీఎల్‌పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై టీఆర్‌ఎస్‌ పార్టీ తీరును విమర్శించారు. కాళేశ్వరం పై ప్రభుత్వం ఆర్భాటాలు చేయడం తప్ప అక్కడ జరుగుతున్నది ఏమీ లేదని దుయ్యబట్టారు. గువకు తరలించేందుకు నీరు అందుబాటులో ఉన్నా నీరంతా వృధాగా కిందకు వదులుతున్నారన్నారు.

ఎంత నీరు అందుబాటులో ఉందో అంత నీటిని వినియోగించుకునే అవకాశం ఉన్నా ప్రభుత్వ శ్రద్ధ కొరవడినందువల్లే ఉపయోగించుకోలేకపోతున్నారు. పైనుంచి ఆదేశాలు లేకనే తాము ఏమీ చేయలేకపోతున్నామని అధికారులు అంటున్నారని చెప్పారు. కాళేశ్వరం వల్లనే రాష్ట్రంలో యూరియా కొరత వచ్చిందని టీఆర్‌ఎస్‌ చెబుతుండటం హాస్యాస్పదమని, విద్యుత్‌ వినియోగానికి భయపడే ప్రభుత్వం నీటిని ఎత్తివేయలోక పోతుందని అన్నారు. ఇప్పటి వరకు 45 టీఎమ్‌సీల నీటిని ఎగువకు పంపే అవకాశం ఉన్నా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Related posts